గాయం ఆపని యాత్ర...!
ysrcp party, jaganmohanreddy, ysrcparmy వై.ఎస్.జగన్ పై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసినదే.. ఎన్నో అనుమానాలకు దారి తీసిన ఈ ఘటన, అందరిలోనూ ఉత్కంఠ రేపింది. జనాదరణ ఉన్న నాయకుడిపై దాడి జరిగితే,అ దాడికి గల కారణాలు వెలికి తీయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే చెప్పాలి, ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థ అవుతోంది. ఈ సంఘటన జగన్ అభిమానులకే కాక రాష్ట్ర ప్రజలందరికీ కలవరానికి గురిచేసింది. ఆశయ సాధనలో నిరంతరం పాటుపడే వ్యక్తి శరీరానికి గాయపరిచారు గాని. గుండెలోని సంకల్పాన్ని ఏనాటికి గాయపరచలేకపోయారు. మళ్లీ యాత్రను పునః ప్రారంభిస్తూ తనవారి కోసం నవ్వుతూ నడక మొదలైంది. ప్రభంజనంలా దూసుకు పోతూ పలకరిస్తూ సాగిపోతుంది. పడిలేచే కెరటంలా అలసట లేకుండా తన యాత్రను కొనసాగిస్తూ , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు వింటూ సాగిపోతోంది జగన్ ప్రజాసంకల్ప యాత్ర...