Posts

Showing posts with the label YS rajasekhar reddy

సార్వభౌముడిగా చరిత్రలో నిలిచాడు

Image
Y.S Rajasekhar Reddy , it's not a name it's a Brand  చీకట్లను తరిమేస్తూ వెలుగుల ఉదయిస్తాయి. అలాగే  చెడుని  రూపుమాపిననాడే మంచి ఊపిరి  పోసుకుంటుంది.   మంచి చేయాలని అనుకుంటే సరి కాదు, అది మనస్సు నుంచి పుట్టాలి అలా చేసేవారు కొందరే పుడుతారు. అటువంటి వారు చిరస్మరణీయులుగా చరిత్రలో మిగిలిపోతారు. రాజకీయం అంటేనే ముళ్ళ కిరీటం లాంటిది. అయితే  తమ సొంత  ప్రయోజనాల కోసం ప్రజల  జీవితాల్ని పణంగా పెట్టి గద్దెనెక్కి, అధికారంలోకి రాగానే  ప్రజలను గాలికొదిలేసే రాజకీయనాయకులు లేకపోలేరు. ఇలాంటి  రాజకీయనాయకుల వలన   ప్రజల జీవితాల్లో వెలుగులు హరించుకుపోయాయి. "దేశానికి రైతు వెన్నుముక." అటువంటి రైతుల జీవితాలు   బీడు భూముల్లో బలైపోయాయి. కరువు కాటకాలకు బలియై , బ్రతుకు తెరువుకోసం భూములను, బిడ్డలను వదిలి పట్టణాలకు వలస పోయి ఆకలి ఆర్తనాదాలు చేస్తూ, సహాయం చేసేవారి   కోసం ఎదురు చూస్తూ, కన్నీళ్ల కడలిలో ఒడ్డుకు చేరడం కోసం  అనేక కష్టాలనోర్చి , కాలాన్ని నెట్టుకొచ్చేవారు.జబ్బు చేసి వైద్యం చేసుకునే స్తోమత లేక  కాటికి కాలు చార్చి  ఎదురు  చూపులు తప్ప మరి ఏ దిక్కు లేని పరిస్థితి అప్పుడు. దారిద్రమే  దిక్క